తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : * భద్రాద్రి, కొత్తగూడెం (అర్బన్):శ్రీ కనకదుర్గ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 10, 11 వార్డులోని నెహ్రూ బస్తి ,లక్ష్మీ టాకీస్ ఏరియా, వనం దాస్ గడ్డ ఏరియాలో అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె షాబీర్ పాష మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అందరూ చల్లగా ఉంటామని ,దేశంలో ఉన్న ప్రజానీకానికి కూడు, గూడు ,విద్య, వైద్యం అందరికీ సమానంగా అందేటట్లు అమ్మ దయ ఉండాలని ప్రజలు కోరుకుంటారని, ప్రజలు భక్తి మార్గంలో పయనించినప్పుడు సమాజంలో అంతా మంచే జరుగుతుందని ఉన్నారు. యువత నేడు భక్తి మార్గంలో నడుస్తున్నారని ,వినాయక చవితి, దేవీ నవరాత్రి ఉత్సవాలు యువత ముందుండి నడిపించడం వల్ల ప్రజల్లో ఐక్యమత్యం ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు భూక్య శ్రీనివాస్ ,పదో వార్డు కౌన్సిలర్ మునిగడప పద్మ ,సిపిఐ నాయకులు గుత్తుల శ్రీనివాస్, సూరిమేని జనార్ధన్ ,గూగులోత్ శంకర్ ,బానోతు శ్రీనివాస్, భూక్య మహేష్ ,ధరావత్ రమేష్, నాయకులు దిలీప్ ,దిలీప్ సింగ్, కాండ్రేగుల మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ