తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు శ్రేణులు సన్నద్ధం కావాలి.ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్యవాదులకు ఒక హెచ్చరిక.పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కోవడంలో కమ్యూనిస్టుల బాధ్యత మరింత పెరిగింది.నిరంతర పోరాటాలతోనే సామాన్యుల హక్కుల పరిరక్షణ సాధ్యం.పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి నుండి నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలి.మతోన్మాద శక్తుల విస్తరణను అడ్డుకోవడమే ప్రధాన కర్తవ్యం.ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా భవిష్యత్ కార్యాచరణ ఉండాలి.ఐక్య పోరాటాల ద్వారానే ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురాగలం.కమ్యూనిస్టు సిద్ధాంతాలే దేశానికి దిక్సూచిగా నిలుస్తాయి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు పార్టీ శ్రేణులు నిరంతరం సన్నద్ధం కావాలని, పెరుగుతున్న రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడంలో కమ్యూనిస్టుల బాధ్యత మరింత పెరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సమావేశం మంగళవారం పాల్వంచలోని శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ, దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కమ్యూనిస్టు కార్యకర్తలు లోతైన అవగాహన కలిగి ఉండాలన్నారు. మతోన్మాద శక్తులు బలపడుతున్న తరుణంలో, లౌకికవాదాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా పార్టీ కేడర్ అప్రమత్తంగా ఉండాలని, ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. కమ్యూనిస్టు నాయకులు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి నమ్మకాన్ని చూరగొనాలని, అప్పుడే బలమైన శక్తిగా ఎదగగలమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా రాజకీయ రిపోర్ట్ ప్రవేశపెటారు. నరాటి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం జిల్లా కార్యవర్గ సభ్యులు సరిరెడ్డి పుల్లారెడ్డి, k. సారయ్య, సలిగంటి శ్రీను, మున్నా లక్ష్మీకుమారి, అడుసుమిల్లి సాయిబాబా వీసంశెట్టి పూర్ణచంద్రరావు, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, కమటం వెంకటేశ్వర్లు, RTC భాస్కర్, భూక్యా దాసురు, ఉప్పుశెట్టి రాహుల్, మువ్వ వెంకటేశ్వర్లు, SK ఫహీం, శంకర్, బంధం నాగయ్య తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ