Wednesday, 16 September 2026 09:09:26 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు శ్రేణులు సన్నద్ధం కావాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

Date : 05 May 2026 08:04 PM Views : 265

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు శ్రేణులు సన్నద్ధం కావాలి.ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్యవాదులకు ఒక హెచ్చరిక.పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కోవడంలో కమ్యూనిస్టుల బాధ్యత మరింత పెరిగింది.నిరంతర పోరాటాలతోనే సామాన్యుల హక్కుల పరిరక్షణ సాధ్యం.పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి నుండి నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలి.మతోన్మాద శక్తుల విస్తరణను అడ్డుకోవడమే ప్రధాన కర్తవ్యం.ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా భవిష్యత్ కార్యాచరణ ఉండాలి.ఐక్య పోరాటాల ద్వారానే ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురాగలం.కమ్యూనిస్టు సిద్ధాంతాలే దేశానికి దిక్సూచిగా నిలుస్తాయి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు పార్టీ శ్రేణులు నిరంతరం సన్నద్ధం కావాలని, పెరుగుతున్న రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడంలో కమ్యూనిస్టుల బాధ్యత మరింత పెరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సమావేశం మంగళవారం పాల్వంచలోని శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ, దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కమ్యూనిస్టు కార్యకర్తలు లోతైన అవగాహన కలిగి ఉండాలన్నారు. మతోన్మాద శక్తులు బలపడుతున్న తరుణంలో, లౌకికవాదాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా పార్టీ కేడర్ అప్రమత్తంగా ఉండాలని, ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. కమ్యూనిస్టు నాయకులు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి నమ్మకాన్ని చూరగొనాలని, అప్పుడే బలమైన శక్తిగా ఎదగగలమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా రాజకీయ రిపోర్ట్ ప్రవేశపెటారు. నరాటి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం జిల్లా కార్యవర్గ సభ్యులు సరిరెడ్డి పుల్లారెడ్డి, k. సారయ్య, సలిగంటి శ్రీను, మున్నా లక్ష్మీకుమారి, అడుసుమిల్లి సాయిబాబా వీసంశెట్టి పూర్ణచంద్రరావు, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, కమటం వెంకటేశ్వర్లు, RTC భాస్కర్, భూక్యా దాసురు, ఉప్పుశెట్టి రాహుల్, మువ్వ వెంకటేశ్వర్లు, SK ఫహీం, శంకర్, బంధం నాగయ్య తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :