Thursday, 14 May 2026 12:57:21 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు శ్రేణులు సన్నద్ధం కావాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

Date : 05 May 2026 08:04 PM Views : 99

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు శ్రేణులు సన్నద్ధం కావాలి.ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్యవాదులకు ఒక హెచ్చరిక.పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కోవడంలో కమ్యూనిస్టుల బాధ్యత మరింత పెరిగింది.నిరంతర పోరాటాలతోనే సామాన్యుల హక్కుల పరిరక్షణ సాధ్యం.పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి నుండి నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలి.మతోన్మాద శక్తుల విస్తరణను అడ్డుకోవడమే ప్రధాన కర్తవ్యం.ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా భవిష్యత్ కార్యాచరణ ఉండాలి.ఐక్య పోరాటాల ద్వారానే ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురాగలం.కమ్యూనిస్టు సిద్ధాంతాలే దేశానికి దిక్సూచిగా నిలుస్తాయి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు పార్టీ శ్రేణులు నిరంతరం సన్నద్ధం కావాలని, పెరుగుతున్న రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడంలో కమ్యూనిస్టుల బాధ్యత మరింత పెరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సమావేశం మంగళవారం పాల్వంచలోని శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ, దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కమ్యూనిస్టు కార్యకర్తలు లోతైన అవగాహన కలిగి ఉండాలన్నారు. మతోన్మాద శక్తులు బలపడుతున్న తరుణంలో, లౌకికవాదాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా పార్టీ కేడర్ అప్రమత్తంగా ఉండాలని, ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. కమ్యూనిస్టు నాయకులు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి నమ్మకాన్ని చూరగొనాలని, అప్పుడే బలమైన శక్తిగా ఎదగగలమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా రాజకీయ రిపోర్ట్ ప్రవేశపెటారు. నరాటి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం జిల్లా కార్యవర్గ సభ్యులు సరిరెడ్డి పుల్లారెడ్డి, k. సారయ్య, సలిగంటి శ్రీను, మున్నా లక్ష్మీకుమారి, అడుసుమిల్లి సాయిబాబా వీసంశెట్టి పూర్ణచంద్రరావు, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, కమటం వెంకటేశ్వర్లు, RTC భాస్కర్, భూక్యా దాసురు, ఉప్పుశెట్టి రాహుల్, మువ్వ వెంకటేశ్వర్లు, SK ఫహీం, శంకర్, బంధం నాగయ్య తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :