తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇందిరమ్మ గృహ నిర్మాణాల సమయాన్ని దృష్టిలో పెట్టుకొని గృహ నిర్మాణ సామాగ్రి రేట్లను అమాంతం వ్యాపారులు పెంచడం పట్ల అధికారులు చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు, భూక్య శ్రీనివాసు లు అధికారులకు విజ్ఞప్తి చేశారు. శనివారం ఉన్నాం దాస్ గడ్డలో జరిగిన ఇందిరమ్మ గృహ లబ్దారుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గృహ నిర్మాణాలను దృష్టిలో పెట్టుకొని ఇదే అదునుగా భావించి సిమెంటు, మట్టి, ఇటుకలు మరియు ఇసుక, ఇనుప సామాగ్రి తదితర గృహపకరణాల రేట్లను విపరీతంగా పెంచడం వల్ల లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణాలు ఈ రేట్ల పెంపుదలతో గృహ నిర్మాణాల లబ్ధిదారులు ఆర్థికంగా చితికి పోవాల్సిన వస్తుందని వారు అన్నారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్దిదారులకి సిమెంటు, ఇటుక ,ఇసుక, మట్టి, ఇనుప రాడ్లు తదితర సామాగ్రి రేట్లు వారికి అందుబాటులో ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాధికారులకు లబ్ధిదారుల తరఫున వారి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఉన్నందాస్ గడ్డ శాఖ 1, 2 కార్యదర్శులు ఎస్కే జలీల్, తొగరు నరేంద్ర కుమార్, నాయకులు గుంజ వెంకన్న,sk శుభానాలి, రాజు, రేవంత్, సంపత్, మైమున భాను, పద్మ కోరి కళ్యాణి, కొత్తూరు శారద తదితర లబ్ధిదారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ