Monday, 03 August 2026 09:35:46 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

కొత్తగూడెంలో ఉచిత సంస్కృత శిక్షణ శిబిరం.

Date : 03 June 2026 10:43 AM Views : 135

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సంస్కృత భాష ప్రాచీన భారతీయ జ్ఞాన సంపదకు, సంస్కృతికి, ఆధ్యాత్మికతకు మూలాధారమని, యువతతో పాటు అన్ని వయస్సుల వారిలో సంస్కృతంపై ఆసక్తి పెంపొందించేందుకు “సంస్కృత భారతి” ఆధ్వర్యంలో “భాషా ప్రవేశ వర్గ” పేరుతో ఉచిత మాట్లాడే సంస్కృత శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ శిబిరం సేవాభారతి – వివేకానంద యువ కేంద్రం, కొత్తగూడెం సహకారంతో 04-06-2026 నుండి 10-06-2026 వరకు ప్రతిరోజు సాయంత్రం 5.30 గంటల నుండి 8.30 గంటల వరకు సేవాభారతి వివేకానంద యువ కేంద్రం, బస్ స్టాండ్ ఎదురుగా, కొత్తగూడెంలో నిర్వహించబడుతుంది.10 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయస్సు గల వారందరూ ఈ శిబిరంలో పాల్గొనవచ్చని తెలిపారు. సంస్కృత భాషపై ఎటువంటి ముందస్తు పరిజ్ఞానం అవసరం లేదని, సరళమైన సంభాషణా విధానంలో శిక్షణ అందించబడుతుందని పేర్కొన్నారు. ఈ శిబిరంలో సంస్కృతంలో దైనందిన సంభాషణలు, సరళ పదాలు, వాక్య నిర్మాణం, సంస్కృత సాంస్కృతిక అవగాహన వంటి అంశాలను ఆసక్తికరంగా బోధించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువత, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు తదితరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.ఈ శిబిరానికి ఎటువంటి ఫీజు లేదు. పూర్తిగా ఉచితంగా నిర్వహించబడుతుంది.బి. సురేష్(వారాహి) 94904 62038, పాతూరి పాండురంగ విటల్, అడ్వకేట్. 93969 39495.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :