తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సంస్కృత భాష ప్రాచీన భారతీయ జ్ఞాన సంపదకు, సంస్కృతికి, ఆధ్యాత్మికతకు మూలాధారమని, యువతతో పాటు అన్ని వయస్సుల వారిలో సంస్కృతంపై ఆసక్తి పెంపొందించేందుకు “సంస్కృత భారతి” ఆధ్వర్యంలో “భాషా ప్రవేశ వర్గ” పేరుతో ఉచిత మాట్లాడే సంస్కృత శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ శిబిరం సేవాభారతి – వివేకానంద యువ కేంద్రం, కొత్తగూడెం సహకారంతో 04-06-2026 నుండి 10-06-2026 వరకు ప్రతిరోజు సాయంత్రం 5.30 గంటల నుండి 8.30 గంటల వరకు సేవాభారతి వివేకానంద యువ కేంద్రం, బస్ స్టాండ్ ఎదురుగా, కొత్తగూడెంలో నిర్వహించబడుతుంది.10 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయస్సు గల వారందరూ ఈ శిబిరంలో పాల్గొనవచ్చని తెలిపారు. సంస్కృత భాషపై ఎటువంటి ముందస్తు పరిజ్ఞానం అవసరం లేదని, సరళమైన సంభాషణా విధానంలో శిక్షణ అందించబడుతుందని పేర్కొన్నారు. ఈ శిబిరంలో సంస్కృతంలో దైనందిన సంభాషణలు, సరళ పదాలు, వాక్య నిర్మాణం, సంస్కృత సాంస్కృతిక అవగాహన వంటి అంశాలను ఆసక్తికరంగా బోధించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువత, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు తదితరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.ఈ శిబిరానికి ఎటువంటి ఫీజు లేదు. పూర్తిగా ఉచితంగా నిర్వహించబడుతుంది.బి. సురేష్(వారాహి) 94904 62038, పాతూరి పాండురంగ విటల్, అడ్వకేట్. 93969 39495.
Admin
తెలుగు వెలుగు టీవీ