తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మన శరీరంలోని ఎముకలు, కండరాలు, కీళ్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే వైద్యశాఖనే ఆర్థోపెడిక్స్ అని కన్సల్టెంట్ వైద్యుడు డా. సునీల్ తెలిపారు. ప్రస్తుత కాలంలో మోకాళ్ల నొప్పి, వెన్ను నొప్పి, కీళ్ల సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్ల నష్టం పెరిగి మోకాలి మార్పిడి (నీ రీప్లేస్మెంట్) వంటి శస్త్రచికిత్సలు అవసరం అయ్యే పరిస్థితులు వస్తున్నాయని చెప్పారు. అయితే ప్రతి నొప్పికీ వెంటనే శస్త్రచికిత్స అవసరం ఉండదని, సరైన పరీక్షలు, చికిత్సలు, వ్యాయామం మరియు జీవనశైలిలో మార్పులతో చాలా సమస్యలను తగ్గించుకోవచ్చని వివరించారు. అవసరమైన సందర్భాల్లో మాత్రమే వైద్యుల సూచనల మేరకు శస్త్రచికిత్స చేయించుకోవడం ఉత్తమమని సూచించారు. ఎముకలు, కీళ్ల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి వైద్యులను సంప్రదించడం ద్వారా పెద్ద సమస్యలను నివారించవచ్చని తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమమైన వ్యాయామం మరియు శరీర బరువును నియంత్రణలో ఉంచడం ద్వారా కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం ఉత్తమం డా. సునీల్ (సాయికృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్).ఆర్థోపెడిక్స్ అంటే కేవలం ఫ్రాక్చర్లు లేదా మోకాళ్ల మార్పిడి మాత్రమే కాదని, ఇందులో స్పోర్ట్స్ మెడిసిన్ వంటి ముఖ్యమైన విభాగం కూడా ఉందన్నారు. లిగమెంట్ తెగినప్పుడు కీహోల్ పద్ధతిలో రిపేర్ లేదా రీకన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందని తెలిపారు. ముందుగానే సమస్య తీవ్రతను గుర్తించి సరైన వైద్యం చేయించుకుంటే సాధారణ జీవితం గడపవచ్చన్నారు.గత 27 సంవత్సరాల అనుభవంలో ఆర్థోపెడిక్స్ రంగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, ప్రస్తుతం కీహోల్ సర్జరీ వంటి ఆధునిక సాంకేతికతలతో రోగులు తక్కువ సమయంలోనే కోలుకుంటున్నారని తెలిపారు. ఈ విధానంతో శస్త్రచికిత్స చేసిన రోగి ఒక్క రోజులోనే ఇంటికి వెళ్లే అవకాశం ఉందన్నారు. ప్రతి నెల రెండవ మంగళవారం రోజున కొత్తగూడెంలోని ప్రజలకు అందుబాటులో ఉంటానని డా. సునీల్ తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ