Sunday, 07 June 2026 08:47:32 AM
# బిజెపి పార్టీ సీనియర్ నాయకులు సొప్పరి క్రాంతి ఆధ్వర్యంలో గౌతంపూర్ లో మొక్కలు నాటడం జరిగినది. # ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి. # మున్సిపల్ కార్పొరేషన్‌లో సిపిఐ పక్ష బలాన్ని సమర్థవంతంగా చాటాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు # నామా వినోద్‌పై దాడి చేసిన భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. # మీసేవ దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్‌లోనే. జీపీఓలు, ఆర్‌ఐలకు అవగాహన కల్పించిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు. # ప్రజల ప్రాణ రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలి. గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మరో రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి. # భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవిన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. # విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పెట్రోలింగ్,బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మాస్టర్ ఈ .కె ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కాకర్ల గ్రామం నందు ఉచిత హోమియో వైద్య శిబిరం. # భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ పార్కులో ప్లాస్టిక్ ఏరివేత -మొక్కలు నాటిన ఎస్ జి ఎఫ్. # కొత్తగూడెం ఇల్లందు రహదారిపై స్కూటీని ఢీకొన్న లారీ. # పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేద్దాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # గోపన్నగూడెంలో మినీ మేడారం జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె. # జనగణన జాబితా వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # సమున్నత ఆశయాలతోనే భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావం. భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి. # ప్రజా సమస్యల పరిష్కార మార్గాన్ని చూపే విధంగా గ్రామ సభలు ఉండాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

ఆర్థోపెడిక్స్‌పై అవగాహన అవసరం. ప్రముఖ ఆర్థో వైద్యులు డాక్టర్ దాచేపల్లి సునీల్

Date : 10 March 2026 06:08 PM Views : 392

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మన శరీరంలోని ఎముకలు, కండరాలు, కీళ్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే వైద్యశాఖనే ఆర్థోపెడిక్స్ అని కన్సల్టెంట్ వైద్యుడు డా. సునీల్ తెలిపారు. ప్రస్తుత కాలంలో మోకాళ్ల నొప్పి, వెన్ను నొప్పి, కీళ్ల సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్ల నష్టం పెరిగి మోకాలి మార్పిడి (నీ రీప్లేస్‌మెంట్) వంటి శస్త్రచికిత్సలు అవసరం అయ్యే పరిస్థితులు వస్తున్నాయని చెప్పారు. అయితే ప్రతి నొప్పికీ వెంటనే శస్త్రచికిత్స అవసరం ఉండదని, సరైన పరీక్షలు, చికిత్సలు, వ్యాయామం మరియు జీవనశైలిలో మార్పులతో చాలా సమస్యలను తగ్గించుకోవచ్చని వివరించారు. అవసరమైన సందర్భాల్లో మాత్రమే వైద్యుల సూచనల మేరకు శస్త్రచికిత్స చేయించుకోవడం ఉత్తమమని సూచించారు. ఎముకలు, కీళ్ల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి వైద్యులను సంప్రదించడం ద్వారా పెద్ద సమస్యలను నివారించవచ్చని తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమమైన వ్యాయామం మరియు శరీర బరువును నియంత్రణలో ఉంచడం ద్వారా కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం ఉత్తమం డా. సునీల్ (సాయికృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌).ఆర్థోపెడిక్స్ అంటే కేవలం ఫ్రాక్చర్లు లేదా మోకాళ్ల మార్పిడి మాత్రమే కాదని, ఇందులో స్పోర్ట్స్ మెడిసిన్ వంటి ముఖ్యమైన విభాగం కూడా ఉందన్నారు. లిగమెంట్ తెగినప్పుడు కీహోల్ పద్ధతిలో రిపేర్ లేదా రీకన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందని తెలిపారు. ముందుగానే సమస్య తీవ్రతను గుర్తించి సరైన వైద్యం చేయించుకుంటే సాధారణ జీవితం గడపవచ్చన్నారు.గత 27 సంవత్సరాల అనుభవంలో ఆర్థోపెడిక్స్ రంగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, ప్రస్తుతం కీహోల్ సర్జరీ వంటి ఆధునిక సాంకేతికతలతో రోగులు తక్కువ సమయంలోనే కోలుకుంటున్నారని తెలిపారు. ఈ విధానంతో శస్త్రచికిత్స చేసిన రోగి ఒక్క రోజులోనే ఇంటికి వెళ్లే అవకాశం ఉందన్నారు. ప్రతి నెల రెండవ మంగళవారం రోజున కొత్తగూడెంలోని ప్రజలకు అందుబాటులో ఉంటానని డా. సునీల్ తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :