తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మే 14 తెలుగు వెలుగు )జూలూరుపాడు బిజెపి మండల అధ్యక్షులు భూక్య రమేష్ మాట్లాడుతూ కేంద్ర ములోని నరేంద్ర మోడీ ప్రభుత్వము ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ ను ప్రతి రైతు చేయించుకో గలరు .వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేసి వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వము చేపట్టింది.రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలకు,ప్రోత్సాహకాలను ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పని సరి అని మార్గదర్శకాలను విడుదల చేసింది. కావున రైతులందరూ పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు మరియు మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన ఫోన్ నెంబరును తీసుకొని మీ పరిధిలోని ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారులు దగ్గరికి వెళ్లి ఫార్మర్ రిజిస్టర్ చేసుకోగలరు. అని మండల రైతులను బిజెపి పార్టీ తరుపున కోరారు
Admin
తెలుగు వెలుగు టీవీ