తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 17 తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం జూలూరుపాడు గ్రామ కోయకాలని ప్రాథమిక పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి విధ్వంసం చేశారు. పాఠశాల గదుల తలుపులు పగలగొట్టి వస్తువులు చిందరవందర చేసి బీరువాలో ఉన్న సౌండ్ స్పీకర్ ను ఎత్తుకెళ్లారు. ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు గత మూడు నెలల వ్యవధిలో పలుమార్లు పాఠశాలలో విధ్వంసం చేసి పాఠశాల గదులల్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేస్తున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జూలూరుపాడు క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు టీ లక్ష్మీ నరసయ్య కు ఎంఇఓ జుంకీలాల్ కు వివరించగా వారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చెయ్యటంతో పాఠశాలకు వచ్చి పోలీసులు వచ్చి పరిశీలించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ