తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TSNAB) డైరెక్టర్ సందీప్ శాండిల్య ఆధ్వర్యంలో రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణ కోసం అనేక చర్యలు చేపట్టారు. సమాజ శ్రేయస్సే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జూలూరుపాడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రాణా ప్రతాప్ సేవలను గుర్తించి ఉన్నత స్థాయి అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్ పి రోహిత్ రాజు , అడిషనల్ ఎస్పీ పరితోష్ పంకజ్ , భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ సంగ్వార్ చేతుల మీదుగా ఎస్సై రాణా ప్రతాప్ శనివారం ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకోవటం పట్ల ఎస్సై రాణా ప్రతాప్ ను పలువురు ప్రముఖులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ