Monday, 03 August 2026 12:44:05 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

విద్యార్థులకు చదువుతో పాటు మంచి ఆరోగ్యం కూడా అత్యంత ముఖ్యం – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 11 August 2025 12:44 PM Views : 453

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నులిపురుగుల నివారణ మాత్రల వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు – కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు . విద్యార్థుల విద్యా ప్రగతికి శారీరక, మానసిక ఆరోగ్యం కీలకమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. అంతర్జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా, సోమవారం పాల్వంచ బొల్లారిగూడెం మైనారిటీ పాఠశాలలో నిర్వహించిన జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమమునకు స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావుతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కలెక్టర్ మాట్లాడుతూ, పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటేనే చదువులో పూర్తి స్థాయి దృష్టి పెట్టగలరని, అందుకే నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రాధాన్యత వహిస్తోందని తెలిపారు. నులిపురుగులు శరీరంలో ఉండటం వలన పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత, ఆకలి తగ్గడం, అలసట, కడుపు నొప్పి, వికారం, విరోచనాలు, బరువు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని, ఇవి వారి శారీరక ఎదుగుదల, చదువులో ఏకాగ్రత, మానసిక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని వివరించారు. ఈ సమస్యలను నివారించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంను ప్రతి సంవత్సరం విజయవంతంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఆల్బెండజోల్ మాత్రలు నులిపురుగులను పూర్తిగా నిర్మూలించడంలో, రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల 3,36,136 మంది పిల్లలు మరియు యువతకు ఈ మాత్రలు అందించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి వైద్య ఆరోగ్య శాఖతో పాటు అన్ని సంబంధిత ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రతి పాఠశాల, వసతి గృహం, అంగన్వాడీ కేంద్రం, కళాశాలలో ఈ మాత్రలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. నులిపురుగుల నివారణ మాత్రల వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకపోవడంతో పాటు, ఎలాంటి అపోహలు పెట్టుకోకూడదని ప్రజలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కోరారు. మధ్యాహ్న భోజనం అనంతరం మాత్రలు ఇవ్వాలని, 1–2 సంవత్సరాల వయసు పిల్లలకు సగం మాత్ర, 2–19 సంవత్సరాల వారికి పూర్తి మాత్ర నమిలి మింగేలా చేయాలని సూచించారు. ఆగస్టు 18 వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 19 ఏళ్ల లోపు ప్రతి ఒక్కరికి మాత్రలు అందించడానికి సంబంధిత శాఖలు సమన్వయంతో కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. నులిపురుగులు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రధాన కారణమని, వాటి నివారణ ద్వారా పిల్లలు ఆరోగ్యవంతంగా, చదువులో ప్రతిభ కనబరుస్తారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జయలక్ష్మి, సిపిఓ సంజీవరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, బోధక సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :