తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వన్యప్రాణులను తిలకించేందుకు ప్రత్యేక సఫారీ ట్రాక్ల ఏర్పాటు, పర్యాటకులను ఆకట్టుకోనున్న బటర్ ఫ్లై పార్క్.నియోజకవర్గంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రేత్యేక ద్రుష్టి సారించాం.త్వరలోనే హరిత హోటల్ ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. పాల్వంచ పరిధిలోని కిన్నెరసాని ప్రాజెక్టులో అటవీశాఖ ద్వారా రూ.45 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన మూడు ప్రత్యేక సఫారీ వాహనాలను, బటర్ఫ్లై పార్కును, ఫీడ్ స్టోరేజ్ షెడ్ను, సీసీ రోడ్డును జిల్లా కలెక్టర్ అంకిత్'తో కలిసి అయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో అయన మాట్లాడారు. పర్యాటకులు అడవిలో దాదాపు 8 కిలోమీటర్ల మేర ప్రయాణించి జింకలు, వన్యప్రాణులు, పక్షులను నేరుగా చూసేలా ప్రత్యేక సఫారీ ట్రాక్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పర్యాటకులు ఈ సరికొత్త సఫారీ రైడ్, బటర్ఫ్లై పార్కులను సందర్శించి సరికొత్త అనుభూతిని పొందేవిధంగా అన్ని వసతులు అందుబాటులోకి తెచ్చామన్నారు. కిన్నెరసానిలోని బోటింగ్, జింకల పార్కును మరింతగా నవీకరిస్తామని చెప్పారు. క్రాస్ రోడ్డులోని హరిత హోటల్ను త్వరలోనే ప్రారంభించుకోబోతున్నామని, దీనికి మరిన్ని నిధులు మంజూరు చేయించి, తుదిమెరుగులు దిద్ది ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని పర్యాటక ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, జిల్లా ఫారెస్ట్ అధికారి క్రిస్ట గౌడ్, కిన్నెరసాని సర్పంచ్ వజ్ర రామకృష్ణ, సీపీఐ నాయకులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు ఉప్పుశెట్టి రాహుల్, డి సుధాకర్, అన్నారపు వెంకటేశ్వర్లు, శనగారపు శ్రీనివాసరావు, వైఎస్ గిరి, శ్రీను, ఖాసీం, బాబురావు, వెంకన్న చల్ల కృష్ణ, ఫారెస్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ