Friday, 19 June 2026 02:28:02 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు.

Date : 18 June 2026 07:24 PM Views : 82

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వన్యప్రాణులను తిలకించేందుకు ప్రత్యేక సఫారీ ట్రాక్‌ల ఏర్పాటు, పర్యాటకులను ఆకట్టుకోనున్న బటర్ ఫ్లై పార్క్.నియోజకవర్గంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రేత్యేక ద్రుష్టి సారించాం.త్వరలోనే హరిత హోటల్ ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. పాల్వంచ పరిధిలోని కిన్నెరసాని ప్రాజెక్టులో అటవీశాఖ ద్వారా రూ.45 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన మూడు ప్రత్యేక సఫారీ వాహనాలను, బటర్‌ఫ్లై పార్కును, ఫీడ్ స్టోరేజ్ షెడ్‌ను, సీసీ రోడ్డును జిల్లా కలెక్టర్ అంకిత్'తో కలిసి అయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో అయన మాట్లాడారు. పర్యాటకులు అడవిలో దాదాపు 8 కిలోమీటర్ల మేర ప్రయాణించి జింకలు, వన్యప్రాణులు, పక్షులను నేరుగా చూసేలా ప్రత్యేక సఫారీ ట్రాక్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పర్యాటకులు ఈ సరికొత్త సఫారీ రైడ్, బటర్‌ఫ్లై పార్కులను సందర్శించి సరికొత్త అనుభూతిని పొందేవిధంగా అన్ని వసతులు అందుబాటులోకి తెచ్చామన్నారు. కిన్నెరసానిలోని బోటింగ్, జింకల పార్కును మరింతగా నవీకరిస్తామని చెప్పారు. క్రాస్ రోడ్డులోని హరిత హోటల్‌ను త్వరలోనే ప్రారంభించుకోబోతున్నామని, దీనికి మరిన్ని నిధులు మంజూరు చేయించి, తుదిమెరుగులు దిద్ది ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని పర్యాటక ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, జిల్లా ఫారెస్ట్ అధికారి క్రిస్ట గౌడ్, కిన్నెరసాని సర్పంచ్ వజ్ర రామకృష్ణ, సీపీఐ నాయకులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు ఉప్పుశెట్టి రాహుల్, డి సుధాకర్, అన్నారపు వెంకటేశ్వర్లు, శనగారపు శ్రీనివాసరావు, వైఎస్ గిరి, శ్రీను, ఖాసీం, బాబురావు, వెంకన్న చల్ల కృష్ణ, ఫారెస్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :