Wednesday, 16 September 2026 05:46:12 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం – రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలి : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 22 June 2026 03:03 PM Views : 169

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బూర్గంపాడులో గురుకుల పాఠశాల, ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ బూర్గంపాడు మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండలంలోని తెలంగాణ అల్పసంఖ్యాక గురుకుల పాఠశాలతో పాటు మొరంపల్లి బంజర గ్రామంలోని శ్రీ లక్ష్మి గణపతి ఫెర్టిలైజర్ దుకాణాన్ని సందర్శించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, ఆహార నాణ్యత, రైతులకు ఎరువుల లభ్యత తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మొదట తెలంగాణ అల్పసంఖ్యాక గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్ పాఠశాలలోని కిచెన్ షెడ్, స్టోర్ రూమ్, తరగతి గదులు, వసతి గృహాలను పరిశీలించారు. కిచెన్ షెడ్‌లో వంటల తయారీ విధానాన్ని పరిశీలించి విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పోషకాహారం అందించాలని అధికారులను ఆదేశించారు. వంటశాల, భోజనశాల పరిసరాల్లో పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మెనూ చార్ట్‌ను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారమే ఆహారం అందుతున్నదా లేదా అని ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మెనూ అమలులో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూడాలని సూచించారు. అనంతరం స్టోర్ రూమ్‌ను పరిశీలించి నిల్వ ఉంచిన బియ్యం, పప్పులు, నిత్యావసర సరుకులు, కూరగాయల నాణ్యతను తనిఖీ చేశారు. ఎప్పటికప్పుడు తాజా కూరగాయలను మాత్రమే వంటకు వినియోగించాలని, ఆహార పదార్థాల నిల్వ, వినియోగంలో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత విషయంలో రాజీ పడవద్దని సూచించారు. విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ పాఠశాలలో అందుతున్న విద్య, వసతి, భోజనం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థుల చేరికలు, హాజరు శాతం, బోధనా కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం మొరంపల్లి బంజర గ్రామంలోని శ్రీ లక్ష్మి గణపతి ఫెర్టిలైజర్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు తగినంతగా అందుబాటులో ఉన్నాయా లేదా అనే విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. దుకాణంలోని పత్తి విత్తనాల ప్యాకెట్లు, వివిధ రకాల ఎరువులు, పురుగుల మందుల నిల్వలను తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి నిల్వలు, విక్రయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గోదాములో నిల్వ ఉంచిన యూరియా బస్తాలను పరిశీలించి నిల్వల పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలని డీలర్లకు సూచించారు. రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఇన్‌పుట్లు అందించడంలో నిర్లక్ష్యం ఉండరాదన్నారు. స్టాక్ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ నిల్వలు, విక్రయాల వివరాలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. వ్యవసాయ సీజన్‌లో రైతులకు అవసరమైన ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగితే సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట కలెక్టర్ వెంట బూర్గంపాడు తాసిల్దార్ కె.ఆర్.కె.వి ప్రసాద్,డిప్యూటీ తాసిల్దార్ సమ్మయ్య, ఎంపీడీవో జమ్మల రెడ్డి, ఎంపీవో, కళాశాల ప్రిన్సిపాల్ నాగజ్యోతి, వ్యవసాయ శాఖ అధికారి ఏవో శంకర్, హౌసింగ్ ఏడి, జి పి ఓ లు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :