Thursday, 02 July 2026 04:31:10 AM
# సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. # నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం. # కార్మికుల న్యాయమైన వేతన హక్కులను కాలరాయొద్దు – 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. # వట్టికొండ రజిని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, బట్టల పంపిణీ. # నూతన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. # ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్. # ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. # మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # తల్లిదండ్రుల మందలించడంతో మనస్తాపం చెంది కొడుకు ఆత్మహత్య. # పద్ధతి మార్చుకోండి లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్. # ​ బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. # ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుందాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాల, సహకార, సంబంధిత అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,

Date : 10 November 2025 07:31 PM Views : 335

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సోమవారం హైద్రాబాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు,పౌర సరఫరాల, సహకార,సంబంధిత అధికారులతో ధాన్యం,కాటన్, సోయా, కొనుగోళ్ల కేంద్రాల నిర్వహణ తదితర అంశాలపై రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు,జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంనుండి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు,ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం, పత్తి, సోయా, తదితర పంటల కొనుగోళ్ల కేంద్రాల నిర్వహణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పిస్తూ చర్యలు తీసుకోవాలని, వెంటనే కేంద్రాలను ప్రారంభించాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే తరలించాలని, వాతావరణ పరిస్థితులను రైతులకు తెలియజేస్తూ అప్రమత్తంగా ఉంచాలని, కేంద్రాలలో ప్యాడీ క్లీనర్స్, మాచర్ మిషన్, మిషనరీస్, గన్ని సంచులు, తార్పాలిన్లు, లారీలను సిద్ధంగా ఉంచుకోవాలని, సూచించారు,వచ్చే మూడు నాలుగు వారాలలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు, మిల్లర్లు, కాంట్రాక్టర్స్, హమాలీలు, అంశాలపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు, పూర్తిస్థాయిలో అన్ని విభాగాలు సమన్వయంతో కలిసి పనిచేసే ధాన్యం సేకరణ కొనుగోళ్ల విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు,వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో రైతులకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు,ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్డిఓ విద్యా చందన, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, సహకార శాఖ అధికారి శ్రీనివాసరావు, డిఎం సివిల్ సప్లై త్రినాధ్ బాబు , మార్కెటింగ్ అధికారి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :