తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శుక్రవారం రోజున సింగరేణి భవన్లో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ను మరియు డైరెక్టర్ (పా) గారిని గుర్తింపు సంఘం ఎఐటియుసి నాయకులు కలిసి సింగరేణిలో నెలకొని ఉన్న పలు సమస్యల పరిష్కారం కొరకు చర్చించడం జరిగింది.అందులోభాగంగా చైర్మన్ గారిని మరియు డైరెక్టర్(పా)ను కలిసి పలు సమస్యలు తెలపడం జరిగింది సానుకూలంగా స్పందిస్తూ మెడికల్ బోర్డును ఈ నెల ఆఖరిలోపు పెట్టుటకు ఒప్పుకున్నారు, అదేవిధంగా ఇన్వాల్యుడేషన్ అయిన ఉద్యోగుల వారసులు మెడికల్ ఫిట్ అయి పోస్టింగ్ కొరకు ఎదురుచూస్తున్న 473 మంది నవ యువకులకు ఈనెల 16 తారీకున కొత్తగూడెం యందు పోస్టింగ్ ఆర్దర్స్ అందచేస్తారు. మరియు,చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయి స్ట్రక్చరల్ కమిటీ సమావేశం తేదీ 10.11.25 సోమవారం రోజున మరియు జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ (JCC) సమావేశం తేదీ: 11.11.25 మంగళవారం రోజున జరుపుటకు అంగీకరించారు. మరియు అన్ని కార్మికుల పెండింగ్ సమస్యలు స్ట్రక్చరల్ కమిటీ సమావేశంలో చర్చించి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు,ఈ కార్యక్రమం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, ఏఐటియుసి *అధ్యక్ష, కార్యదర్శులు శ్రీ వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజకుమార్, ముస్కే సమ్మయ్య, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు,తాతిదారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ