తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పోలీస్ శాఖలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ ఎనలేని సేవలందించి ఈ రోజు పదవీ విరమణ పొందిన ఏఎస్సై వాంకుడోత్ బీల్యా ని రోజు అడిషనల్ ఎస్పీ నరేందర్ ఓఎస్డి కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.36 సంవత్సరాలు పోలీసు శాఖలో పనిచేసి ప్రస్తుతం బోడు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ ఏఎస్సై బీల్యా ఈ రోజు పదవీ విరమణ పొందడం జరిగింది. పదవీ విరమణ పొందిన ఏఎస్సై ను ఓఎస్డి శాలువాతో మరియు పూలమాలతో ఘనంగా సత్కరించడం జరిగింది.అనంతరం పోలీస్ శాఖలో ఆయన అనుభవాలను ఓఎస్డి తో పంచుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు తమ శేషజీవితాన్ని కుటుంబ సభ్యులతో కలసి ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు.ఎంతో కాలంగా పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజలకు సేవలందించిన అధికారుల అనుభవాలను నూతనంగా పోలీస్ శాఖలో భర్తీ అయిన అధికారులు సిబ్బంది స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.పోలీసు శాఖ నుండి పదవీ విరమణ పొందిన అధికారులు మరియు సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే ఎస్పీ దృష్టికి తీసుకురావాలని సూచించారు.తమ దైనందిన కార్యక్రమాలలో వ్యాయామం,యోగా,ధ్యానం వంటి వాటిని అనుసరిస్తూ తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.అనంతరం పదవీ విరమణ పొందిన ఏఎస్సై బీల్యా కి ప్రశంసాపత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు,ఆర్ఐ ఆపరేషన్స్ రవి మరియు జిల్లా పోలీస్ అధికారుల సంఘం ఉపాధ్యక్షులు ఏసోబు,సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ