తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఆంగ్ల పరీక్ష అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో ముగిసిందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మొత్తం 37 పరీక్షా కేంద్రాలలో సెట్-సి ప్రశ్నపత్రంతో పరీక్ష నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్ష హాజరు వివరాలను వెల్లడిస్తూ.. జిల్లావ్యాప్తంగా జనరల్, వొకేషనల్ విభాగాల్లో కలిపి మొత్తం 8,546 మంది విద్యార్థులకు గాను 8,362 మంది హాజరయ్యారని, 184 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని వివరించారు. జనరల్ విభాగంలో 6,801 మందికి 6,682 మంది (119 మంది గైర్హాజరు), వొకేషనల్ విభాగంలో 1,745 మందికి 1,680 మంది (65 మంది గైర్హాజరు) పరీక్షకు హాజరైనట్లు తెలిపారు.జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని, మాల్ప్రాక్టీస్ కేసులు ఏవీ నమోదు కాలేదని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, తదుపరి పరీక్షలకు కూడా పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా వెల్లడించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ