తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 13 తెలుగు వెలుగు ) : రైతు జీవిత బీమా అప్లికేషన్లలో మార్పుల కోసం సర్కార్ అవకాశం కల్పించింది. ఈ ఆర్థిక సంవత్సరం రైతుబీమా పథకం అమలులో భాగంగా ప్రభుత్వం రైతుల పేరిట భారతీయ బీమా సంస్థకు ప్రిమీయం చెల్లింపులు చేస్తుంది. ఈ క్రమంలో అర్హులైన అన్నదాతలకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం మరో చాన్స్ ఇచ్చింది. గతంలో రైతుబీమాలో నమోదు చేసుకున్న రైతులు తమ వివరాలు ఏమైనా తప్పుగా ఉన్నట్లైతే సరిచేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. నామిని చనిపోతే ఆ స్థానంలో పేరు మార్పు, రైతుతో నామిని సంబంధం ఏదైనా తప్పుగా పడి ఉంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. బీమాలో మార్పులు, చేర్పుల కోసం సంబంధిత క్లష్టర్ల వారీగా మండల వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి వివరాలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ సూచించింది. ఈ మేరకు జూలూరుపాడు మండలం కాకర్ల క్లస్టర్ పరిధి నందు 1432 మంది రైతులు ఉండగా చనిపోయిన వారిని మినహాయించి మిగతా నూటికి నూరు శాతం రైతులకు రైతు బీమా ను పూర్తి చేసిన ఏ ఈ ఓ ప్రసాద్ రావు ను రైతులు అభినందించారు. స్థానిక రైతులు మాట్లాడుతూ మేము మా పనులలో నిమగ్నమై ఉండగా ఏ ఈ ఓ ప్రసాద్ రావు ఫోన్లు చేసి మరి పెండింగ్ లిస్టులో ఉన్న రైతులు అందరివి రైతు బీమా పూర్తి చేశారని కృతజ్ఞతలు తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ