తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : జూలూరుపాడు బీజేపీ పార్టీ పండిట్ దిన్ దయాళ్ ప్రశిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు భూక్యా రమేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ శిక్షణ శిబిరానికి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ , రవి రాథోడ్ , కొణతం లక్ష్మీనారాయణ వక్తలుగా వ్యవహరించారు . ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు భూక్య రమేష్ మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశంగా పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత బలోపేతం, సేవా భావం, దేశభక్తి, మరియు భవిష్యత్తు కార్యాచరణపై నాయకులు మార్గనిర్దేశం మనీ ఈ శిబిరం ద్వారా కార్యకర్తలకు సంస్థ నిర్మాణం అలాగే పార్టీ చరిత్ర , వికాసం , సోషల్ మీడియా వినియోగం , బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం గురించి అవగాహన కొరకు ఈ కార్యక్రమం ఏర్పాటు అని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నిమ్మటూరి రామారావు, ఉపాధ్యక్షుడు బాలకిషన్, యువమోర్చ అధ్యక్షుడు రాంబాబు , కార్యదర్శి బాబూలాల్ , సోషల్ మీడియా కన్వీనర్ చరణ్ , తెల్లం నరసింహారావు , నవీన్ , గోపాల్ రావు , ఉమ మహేశ్వరి, నాగమణి మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ