Saturday, 01 August 2026 11:52:48 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

24×7 కంట్రోల్ రూమ్ ద్వారా ప్రజలకు తక్షణ సేవలు : జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 01 August 2026 05:19 PM Views : 23

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 24×7 కంట్రోల్ రూమ్ ద్వారా ప్రజలకు తక్షణ సేవలు : జిల్లా కలెక్టర్ అంకిత్.వర్షాల అత్యవసర పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ – అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి వర్షాకాల పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేలా జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.వర్షాల కారణంగా తలెత్తే అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా కేంద్రంలోని ఐ టి ఓ సి కార్యాలయంలో జీ–19 గదిలో 24×7 జిల్లా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 3, సోమవారం నుంచి వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులను మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించేలా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు.ఉదయం 7.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు, మధ్యాహ్నం 2.00 గంటల నుంచి రాత్రి 9.00 గంటల వరకు, రాత్రి 9.00 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7.00 గంటల వరకు మూడు షిఫ్టుల్లో కంట్రోల్ రూమ్ నిరంతరాయంగా పనిచేస్తుందని తెలిపారు.ప్రజల నుంచి కంట్రోల్ రూమ్‌కు అందే ఫిర్యాదులు, సమాచారం, వర్షాల కారణంగా తలెత్తే అత్యవసర పరిస్థితులను వెంటనే నమోదు చేసి సంబంధిత శాఖలకు సమాచారం అందిస్తూ తక్షణ చర్యలు చేపట్టేలా సమన్వయం చేయాలని విధుల్లో ఉన్న సిబ్బందిని ఆదేశించారు. అందిన ప్రతి ఫిర్యాదును ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేసి, దానిపై తీసుకున్న చర్యల వివరాలను కూడా నమోదు చేయాలని సూచించారు.జిల్లాలో వర్షాల పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడైనా రహదారులు దెబ్బతినడం, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడం, వాగులు, వంకలు పొంగిపొర్లడం వంటి పరిస్థితులు తలెత్తిన వెంటనే సంబంధిత శాఖలు స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.సంబంధిత శాఖల జిల్లా అధికారులు తమ శాఖలకు కేటాయించిన అధికారులు, ఉద్యోగులు విధులకు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఎవరైనా సెలవులో ఉన్నట్లయితే వారి స్థానంలో వెంటనే ప్రత్యామ్నాయ సిబ్బందిని నియమించాలని కలెక్టర్ ఆదేశించారు.అత్యవసర పరిస్థితుల దృష్ట్యా కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా లేదా ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు.వర్షాల కారణంగా అత్యవసర పరిస్థితులు లేదా ఇతర సమస్యలు ఎదురైనప్పుడు ప్రజలు జిల్లా కంట్రోల్ రూమ్ 08744-241950 నంబర్‌కు సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ కోరారు. ప్రజల నుంచి అందే ప్రతి సమాచారంపై వెంటనే స్పందించి అవసరమైన చర్యలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం అన్ని వేళలా సిద్ధంగా ఉంటుందని తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :