తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : "బిక్కి" సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ మహానగరంలో టీ హబ్బులో జరిగిన జాతీయస్థాయి అవార్డుల ప్రధాన మహోత్సవ కార్యక్రమంలో గత 12 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కోసం పని చేస్తున్న ప్రపంచ పర్యావరణ సంస్థలు జాతీయ స్థాయి ఉత్తమ ఎన్జీవో సంస్థ గుర్తించి హైదరాబాదు నగరంలో టీ హబ్బులో బిక్కీ సంస్థ వారు జాతీయ స్థాయి ఉత్తమ ఎన్జీవో అవార్డుచేత సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీసీ మరి రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా డబ్ల్యూఈఓ జాతీయ అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ భద్ర కి సంస్థ కార్యవర్గ సభ్యులు సహాయ కార్యదర్శి రాజేష్ గౌడ్, చెల్లూరి శ్రీనివాస్ కి శివదాసు గోపాల్ నాయుడు మరియు ప్రపంచ పర్యావరణ సంస్థ కార్యవర్గ బృందం అవార్డుని స్వీకరించడం జరిగింది.ఈ పురస్కారం రావడం పట్ల ప్రపంచ పర్యావరణ సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి నిఖిల్ సాయి, జాతీయ కోశాధికారి రిజ్వాన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బరిగెల భూపేష్, రాష్ట్ర కార్యదర్శి ముత్యాల క్రాంతి నాయుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధులు మొక్కల రాజశేఖర్, శ్యామ్, సైదా బాబు, శ్వేత నాయుడు, రాజు, సామర్ల సమ్మయ్య, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ