Sunday, 02 August 2026 05:06:39 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ఉచిత బస్ ప్రయాణంతో రూ.10,000 కోట్లకు పైగా ఆదా – మహాలక్ష్మి పథకం ప్రభావం”

Date : 31 March 2026 09:03 PM Views : 161

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు 99 రోజులు, ప్రగతి ప్రణాళిక లో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మహిళ బస్సు సౌకర్యం కార్యక్రమం పై పదివేల కోట్లు ప్రయాణ చార్జీలు ఆదా పురస్కరించుకొని ఘనంగా కొత్తగూడెం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో మహాలక్ష్మి స్కీం వేడుకలు మరియ అవగాహన కార్యక్రమం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంక్షేమాధికారి స్వర్ణలత లెనిన అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన అదనపు జిల్లా కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీమతి విద్యాచందన మాట్లాడుతూ కుటుంబ ఖర్చుల్లో కొంత మహిళల ప్రయాణ ఖర్చు తగ్గుతుందన్నారు సేవ్ అయిన డబ్బును కుటుంబ అవసరాలకు వినియోగించుకోగలుగుతున్నారని అన్నారు . జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వాహణ అధికారి నాగలక్ష్మి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం మహిళల జీవితాల్లో వెలుగు నింపుతూ, వారి స్వాతంత్ర్యానికి కొత్త దారులు తెరిచింది అన్నారు . ఈ పథకాన్ని మహిళలు ఎంతో ఆనందంగా స్వాగతించారు. గ్రంధాలయ సంస్థ చైర్మన్ వీరబాబు గారు మాట్లాడుతూ కోట్ల సంఖ్యలో ప్రయాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ పథకాన్ని మహిళలందరూ స్వాగతించారు అన్నారు . ఆర్టీసీ కొత్తగూడెం డిపో అదనపు కంట్రోలర్ నాగేశ్వర రావు డేటా ని నివేదించారు . 9 డిసెంబర్ 2023 నాడు ప్రారంభించబడి 29 మార్చి నాటికి మహిళా ప్రయాణికులు మొత్తం 290.27 కోట్ల సార్లు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారు మరియు రూ. 10,012.15 కోట్లు ఆదా చేసుకున్నారు అని తెలిపారు . డిప్యూటీ మేయర్ లలిత మాట్లాడుతూ మహిళలకోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి మహిళల పక్షపాతి అని కొనియాడారు . ఇంకా ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ సిహెచ్ రాజేష్ , సీడీపీవో పద్మశ్రీ స్వయం సహాయక సంఘాలు , మహిళలు, గ్రామీణ ప్రాంత మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉచిత బస్సు మహిళలకు వరం అని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు . వారి అనుభవాలు పంచుకున్నారు .

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :