తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు 99 రోజులు, ప్రగతి ప్రణాళిక లో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మహిళ బస్సు సౌకర్యం కార్యక్రమం పై పదివేల కోట్లు ప్రయాణ చార్జీలు ఆదా పురస్కరించుకొని ఘనంగా కొత్తగూడెం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో మహాలక్ష్మి స్కీం వేడుకలు మరియ అవగాహన కార్యక్రమం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంక్షేమాధికారి స్వర్ణలత లెనిన అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన అదనపు జిల్లా కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీమతి విద్యాచందన మాట్లాడుతూ కుటుంబ ఖర్చుల్లో కొంత మహిళల ప్రయాణ ఖర్చు తగ్గుతుందన్నారు సేవ్ అయిన డబ్బును కుటుంబ అవసరాలకు వినియోగించుకోగలుగుతున్నారని అన్నారు . జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వాహణ అధికారి నాగలక్ష్మి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం మహిళల జీవితాల్లో వెలుగు నింపుతూ, వారి స్వాతంత్ర్యానికి కొత్త దారులు తెరిచింది అన్నారు . ఈ పథకాన్ని మహిళలు ఎంతో ఆనందంగా స్వాగతించారు. గ్రంధాలయ సంస్థ చైర్మన్ వీరబాబు గారు మాట్లాడుతూ కోట్ల సంఖ్యలో ప్రయాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ పథకాన్ని మహిళలందరూ స్వాగతించారు అన్నారు . ఆర్టీసీ కొత్తగూడెం డిపో అదనపు కంట్రోలర్ నాగేశ్వర రావు డేటా ని నివేదించారు . 9 డిసెంబర్ 2023 నాడు ప్రారంభించబడి 29 మార్చి నాటికి మహిళా ప్రయాణికులు మొత్తం 290.27 కోట్ల సార్లు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారు మరియు రూ. 10,012.15 కోట్లు ఆదా చేసుకున్నారు అని తెలిపారు . డిప్యూటీ మేయర్ లలిత మాట్లాడుతూ మహిళలకోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి మహిళల పక్షపాతి అని కొనియాడారు . ఇంకా ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ సిహెచ్ రాజేష్ , సీడీపీవో పద్మశ్రీ స్వయం సహాయక సంఘాలు , మహిళలు, గ్రామీణ ప్రాంత మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉచిత బస్సు మహిళలకు వరం అని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు . వారి అనుభవాలు పంచుకున్నారు .
Admin
తెలుగు వెలుగు టీవీ