తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : హైద్ాబాద్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలియజేసిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతా రాములు శాలువాతో సత్కరించి సన్మానించారు. యూసుఫ్ గూడలోని నవీన్ యాదవ్ ఇంటి వద్ద ఆయన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్న సీతారాములు విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమానికి, అభివృద్ధికి పట్టం కట్టి నవీన్ యాదవ్ అఖండ మెజారిటీకి తోడ్పడిందని చెప్పారు.
Admin
తెలుగు వెలుగు టీవీ