Friday, 18 September 2026 03:14:47 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

గిరిజన ప్రాంతాల అభివృద్ధి, రవాణా సౌకర్యానికి పెద్దపీఠ : కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు

Date : 23 May 2026 06:24 PM Views : 123

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రవాణా కష్టాల శాశ్వత పరిష్కారానికే సరికొత్త హై లెవల్ బ్రిడ్జిల నిర్మాణాలు మౌలిక వసతుల కల్పనతో పల్లెల రూపురేఖలు మార్చడమే ప్రధాన ధ్యేయం గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికే పిహెచ్సి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా నిరంతర శ్రమ, మరిన్ని నిధుల సాధన సమస్యల పరిష్కారంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి త్వరితగతిన పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం : కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఐటిడిఏ నిధుల ద్వారా పెద్దపీట వేస్తున్నామని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా చిట్టిరామవరం నుంచి చుంచుపల్లి రహదారిపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి, అలాగే కొత్తగూడెం బైపాస్ రోడ్డు నుంచి పెనుబల్లి (గరిమెళ్ళపాడు) ప్రధాన రోడ్డుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పెనుబల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పిహెచ్సి భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనతో పల్లెల రూపురేఖలు మార్చడమే తమ ప్రధాన ధ్యేయమన్నారు. ఈ బ్రిడ్జిల నిర్మాణంతో స్థానిక ప్రజల దశాబ్దాల రవాణా కష్టాలు తీరనున్నాయని, అత్యవసర సమయాల్లో వైద్యం కోసం ఇబ్బందులు పడకుండా పెనుబల్లిలో అధునాతన ప్రాధమిక వైద్యశాల అందుబాటులోకి తెచ్చామని ఆయన వివరించారు. రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, గ్రంధాలయ చైర్మన్ వీరబాబు, అధికారులు ఎంపిడివో శుభాషిణి, తహసీల్దార్ నాగరాజు, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు మధుకర్, శ్రీకాంత్, నాగేంద్ర, స్థానిక నాయకులు వాసిరెడ్డి మురళి, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, భవాని, గోవిందు, సర్పంచి శాంతి శ్రీ, రెడ్డి అరుణ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :