Monday, 03 August 2026 08:14:54 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

గిరిజన ప్రాంతాల అభివృద్ధి, రవాణా సౌకర్యానికి పెద్దపీఠ : కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు

Date : 23 May 2026 06:24 PM Views : 78

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రవాణా కష్టాల శాశ్వత పరిష్కారానికే సరికొత్త హై లెవల్ బ్రిడ్జిల నిర్మాణాలు మౌలిక వసతుల కల్పనతో పల్లెల రూపురేఖలు మార్చడమే ప్రధాన ధ్యేయం గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికే పిహెచ్సి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా నిరంతర శ్రమ, మరిన్ని నిధుల సాధన సమస్యల పరిష్కారంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి త్వరితగతిన పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం : కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఐటిడిఏ నిధుల ద్వారా పెద్దపీట వేస్తున్నామని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా చిట్టిరామవరం నుంచి చుంచుపల్లి రహదారిపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి, అలాగే కొత్తగూడెం బైపాస్ రోడ్డు నుంచి పెనుబల్లి (గరిమెళ్ళపాడు) ప్రధాన రోడ్డుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పెనుబల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పిహెచ్సి భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనతో పల్లెల రూపురేఖలు మార్చడమే తమ ప్రధాన ధ్యేయమన్నారు. ఈ బ్రిడ్జిల నిర్మాణంతో స్థానిక ప్రజల దశాబ్దాల రవాణా కష్టాలు తీరనున్నాయని, అత్యవసర సమయాల్లో వైద్యం కోసం ఇబ్బందులు పడకుండా పెనుబల్లిలో అధునాతన ప్రాధమిక వైద్యశాల అందుబాటులోకి తెచ్చామని ఆయన వివరించారు. రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, గ్రంధాలయ చైర్మన్ వీరబాబు, అధికారులు ఎంపిడివో శుభాషిణి, తహసీల్దార్ నాగరాజు, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు మధుకర్, శ్రీకాంత్, నాగేంద్ర, స్థానిక నాయకులు వాసిరెడ్డి మురళి, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, భవాని, గోవిందు, సర్పంచి శాంతి శ్రీ, రెడ్డి అరుణ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :