తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వర్షాకాలం ప్రారంభ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగిన రక్షణ పరమైన చర్యలు చేపట్టాలి నెలవారీ నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న పోలీస్ అధికారులతో ఎస్పీ మాట్లాడుతూ సీసీటీఎన్ఎస్ 2.0 పరిధిలో నమోదైన కేసుల దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు నిర్దేశిత కాల పరిమితిలో ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని, ప్రతి పోలీసు అధికారి మరియు సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను సకాలంలో పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వర్షాకాలం ప్రారంభ నేపద్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా స్కూల్ బస్సుల ఫిట్నెస్ లను నిశితంగా పరిశీలించాలని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణకై సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ చర్యలు చేపట్టాలని సూచించారు.అనంతరం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న పలు కేసుల వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.గంజాయి వంటి మత్తు పదార్ధాలు,మట్కా,జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.సీసీ కెమెరాల ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కల్పించి తమ నివాస ప్రాంతాల్లో మరియు వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చేయాలని తెలిపారు.సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కోరారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం చేకూరేలా పనిచేయాలని తెలిపారు.మద్యం సేవించి వాహనాలను నడుపుతూ,ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారి గురించి నిరంతరం వాహన తనిఖీలు చేపట్టి పట్టుబడిన వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ,కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,ఇల్లందు డిఎస్పి వెంకన్న బాబు,మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి,డీసీఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి, భద్రాచలం డిఎస్పి అరుణ్ కుమార్ మరియు జిల్లాలోని సిఐలు,ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ