తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లు మంగళవారం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు సాగర్ మల్హోత్రా, గుణ చరిత్, మల్లెల స్వప్న, బత్తుల మధుచంద్, సింధు తపస్వి, గుగులోత్ రాంబాబు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లెల రవిచంద్ర, భట్టు మంజుల, శంకర్, వీరన్న తదితర నాయకులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ