తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ???? సమగ్ర ప్రణాళికతోనే కొత్తగూడెం కార్పొరేషన్ పురోగతి. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నాం. అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ఏజెండాగా ముందుకు వెళ్తున్నా. అధికారులు, ప్రజాప్రతినిధుల సమిష్టి కృషి, సమన్యంతోనే ఆశించిన ఫలితాలు. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. ప్రణాళికతోనే కొత్తగూడెం కార్పొరేషన్ పురోగతి సాధ్యమవుతుందని, ఆ దిశగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు అంకితభావంతో పనిచేయాలని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో ఆదివారం రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణ, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శంకుస్థాపనల బహిరంగ సభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్గత రహదారులు, మురుగు కాలువలు, తాగునీటి సరఫరా వంటి ప్రాథమిక అవసరాలను తీర్చడం ద్వారానే ప్రజా శ్రేయస్సు సిద్ధిస్తుందని పేర్కొన్నారు. మంజూరైన ప్రతి ఒక్క పనిని నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత గడువులోగా వేగంగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా పాలనా యంత్రాంగం నిరంతరం శ్రమించాలన్నారు. ప్రజాధనం సద్వినియోగం అయ్యేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెరగాలని, సమిష్టి కృషితోనే ఆశించిన ఫలితాలు సాధించగలమని స్పష్టం చేశారు. స్థానిక అవసరాలను గుర్తించి నిధుల కేటాయింపులు జరపాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ టౌన్ దమ్మపేట సెంటర్ నుంచి రెండున్నర కిలోమీటర్ల మేర రూ.14 కోట్లతో ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని, మంచికంటి నగర్లో ఎస్ కే పి అపార్ట్మెంట్ నుండి ప్రధాన రహదారి వరకు రూ.50 లక్షలతో పక్కా రోడ్డు నిర్మిస్తున్నామని, కొత్తగూడెం పట్టణ పరిధిలోని పోస్టాఫీస్ సెంటర్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుంచి గోధుమ వాగు వరకు రూ.50 లక్షల నిధులతో డివైడర్లను అభివృద్ధి చేస్తున్నామని కూనంనేని తెలిపారు తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి, కూనంనేని తోపాటు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, కార్పొరేటర్లు ఏ సాయిబాబా, వి విశ్వేశ్వరరావు, జీవిఆర్, శ్యామల, అన్నపూర్ణ, నామ కీర్తి, కూరపాటి సుధాకర్, బండి నరసింహ, దుర్గయ్య, బోయిన విజయ్ కుమార్, మునిగడప పద్మ, దాసరి శ్రీనివాస్, ఎర్రబెల్లి శంకర్, పడాల ఆకాంక్ష, మద్దాల హరిత, పి ధనలక్ష్మి, గడ్డం శాంతి ప్రియ, బి.కళావతి, కంచర్ల హిమశ్రీ, సహేరా బేగం, మంద నాగలక్ష్మి, నాయకులు కంచర్ల జమలయ్య, ఎండి యూసుఫ్, గడ్డం సతీష్ కుమార్, భవాని, సాంబి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ