Thursday, 17 September 2026 07:32:03 PM
# శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్

అప్పుడు అధికారంలో ఉంది ఎవరు.నాడు అడ్డుపడ్డ వాళ్ళే నేడు నీతులు చెప్తున్నారు.పాత్రికేయ సోదరరులు అంతా గమనిస్తున్నారు : టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు

Date : 26 March 2025 05:38 PM Views : 910

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గత 10 ఏళ్ళు అధికారంలో ఉంది ఎవరో అందరికి తెలుసని, అవకాశం ఉన్నప్పుడు కావాలని ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకున్న వాళ్లు జర్నలిస్టులను సభ్యుసమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం వాళ్లకు హోదాకు తగదని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు అన్నారు. మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరూ జర్నలిస్టులకు ఒకే చోట ఇళ్ల స్థలం ఇచ్చే ఆలోచన చేస్తే జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలం ఇచ్చిన క్రెడిట్ ఆయనకు దక్కుతుందని కొందరు అడ్డుకున్న విషయం జర్నలిస్ట్ లు గుర్తు చేసుకోవాలన్నారు. నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరిగినా అదంతా తన క్రెడిట్ అనే ఆలోచనతో నాడు విలేకరులకు తీవ్ర అన్యాయం చేశారని, సింగరేణి అధికారులతో మాట్లాడి వాళ్లకు ఇంటి స్థలం ఇప్పించే అవకాశం ఉన్నపటికీ అప్పుడు చప్పుడు చేయకుండా నేడు ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. అప్పుడే సింగరేణి సంస్థతో మాట్లాడి నామమాత్రపు ధరకు జర్నలిస్ట్ లకు ఇంటి స్థలం ఇచ్చేలా కృషి చేసి ఉంటే నేడు జర్నలిస్టు మిత్రులు ఇలా నిరసన తెలిపే అవసరం రాకపోయేదని, ఆనాడు అధికారంలో ఉండి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కావాలనే తాత్సారం చేశారన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు నిర్దిష్ట ప్రతిపాదనలు చేస్తూ ఎలాంటి అభ్యంతరాలు రాకుండా జర్నలిస్టులకు స్థలాలను ఇచ్చి జర్నలిస్ట్ లకు న్యాయం చేసేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం కట్టుబడి ఉందని, గతంలో జర్నలిస్టులకు ఇళ్లను ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోయే రోజుల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వబోయేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. నిపుణుల సూచన మేరకు ముందుకెళ్దామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్న మాటలను గుర్తు చేసిన ఆయన ఇందిరమ్మ రాజ్యంలో ఖచ్చితంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వస్తాయని స్పష్టం చేశారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ విలేకరులకు ఎం చేయకుండా నేడు విలేకరులు చేస్తున్న దీక్షల వద్ద కావాలనే ఇందిరమ్మ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, అటువంటివాటిని జర్నలిస్ట్ మిత్రులు సభ్యసమాజం గమనిస్తుందన్నారు. అర్హులైన జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని భవిష్యత్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతిపాదనలు చేసి అర్హులైన అందరికి ఇళ్ల స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షలు కూడ ఇచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు దృష్టికి తీసుకెళ్తానన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :