తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెంజూలూరుపాడు, ఆగస్టు 14 : ప్రజల సమస్యలను స్థానిక స్థాయిలోనే త్వరితగతిన పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వికేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో భాగంగా ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి తాళ్లూరి రవి తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన G.O.Ms.No.4, Planning (V) Department, తేదీ 04-08-2026 మార్గదర్శకాల ప్రకారం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జూలూరుపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి MPDO నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు తమ శాఖలకు సంబంధించిన సమస్యలు, విజ్ఞప్తులను ప్రజావాణిలో సమర్పించవచ్చని తెలిపారు. సంబంధిత మండల స్థాయి అధికారులు స్వయంగా హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి సకాలంలో అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.మండల స్థాయి అధికారులు ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు తప్పనిసరిగా సమయపాలనతో హాజరై, తమ శాఖలకు సంబంధించిన ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించాలని MPDO తాళ్లూరి రవి కోరారు.ప్రజలకు పారదర్శకమైన, బాధ్యతాయుతమైన, స్పందించే మరియు ప్రజా కేంద్రిత సేవలను అందించడమే మండల స్థాయి ప్రజావాణి ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని MPDO తాళ్లూరి రవి కోరారు
Admin
తెలుగు వెలుగు టీవీ